అమరావతి: బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ లీడరైన సుజనా మాటలకు విలువలేదన్నారు. బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? అని ప్రశ్నించారు. ‘నీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా?, చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? అని బాలశౌరి నిలదీశారు. అమిత్ షాతో జగన్ భేటీ వివరాలను అధికారికంగా బీజేపీ కానీ.. కేంద్రం కానీ ప్రకటిస్తుంది? కానీ ‘గోడ దూకిన నీవెవరు చెప్పడానికి?’ అని విమర్శించారు. ‘ప్రధాని మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా ధర్మదీక్ష పోరాటాలు చేసింది నీవు కాదా?’ అని ప్రశ్నించారు. అమిత్ షా-జగన్ భేటీ విశేషాలపై నిజమైన బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆరోజే పూర్తిగా వివరించారన్నారు. సుజనా మాత్రం ఢిల్లీలో చంద్రబాబు ఏజెంట్లా విషపు కూతలు కూస్తున్నారన్నారు. సుజనా ఒక డుప్లికేట్ లీడర్ అని మండిపడ్డారు. సుజనాపై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. రాజ్యసభలో జీవీఎల్ ఇప్పటికే సుజనాపై ఫిర్యాదు చేశారన్నారు. తమ పార్టీ ఎంపీలంతా సుజనాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరతామని వెల్లడించారు. బ్యాంకులను మోసం చేసి, డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్ట సభల్లోకి రాకుండా ఉండేలా పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెడతామని ఎంపీ బాలశౌరి చెప్పారు.
previous post
next post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?