(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాష్ట్రంలో బిజెపి, జనసేన పార్టీల కలయికపై వైసిపి పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఆ రెండు పార్టీల కలయిక వల్ల రాష్ట్రంలో వైసిపికి వచ్చే నష్టం ఏమీలేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసిపి చాలా బలంగా ఉందన్నారు.
ఎక్కడైనా రెండు బలహీన పార్టీలు బలపడాలని కోరుకుంటే పొత్తులతో ముందడుగు వేయాలనుకుంటాయనీ, రాష్ట్రంలో బిజెపి, జనసేన పార్టీలది అటువంటి ప్రయత్నమేననీ ఆయన అన్నారు. రెండు పార్టీల విధానాలు ఏమిటో ఈ రోజు సాయంత్రానికి తేలిపోతుందనీ, వారు వెల్లడించే విషయాలపై పరిస్థితిని అంచనా వేయవచ్చనీ రఘురామకృష్ణంరాజు చెప్పారు.
ఆ రెండు పార్టీల మధ్య పొత్తు వల్ల ఒనగూరే ప్రయోజనాలు ఏమిటన్నది తేలాలంటే నాలుగున్నరేళ్లు ఆగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు బలహీనంగా ఉన్న విషయం ప్రజలందరికీ తెలిసిందేనన్నారు.