అమరావతి, ఏప్రిల్ 19: విశాఖ పార్లమెంట్ స్థానం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సిబిఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ ప్రకటనపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.
జనసేన పార్టీ పోటీ చేసిందే 65 స్థానాల్లో అయితే 88 స్థానాలు గెలుచుకొని జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని లక్ష్మీనారాయణ జోస్యం చెబుతున్నాడని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఆయన దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్లు రాసాడని విజయసాయి విమర్శించారు.
ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా అంటూ విజయసాయి ప్రశ్నించారు.