అమరావతి: స్టాలిన్తో కెసిఆర్ భేటీపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తన దైన శైలిలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇక చంద్రం సారుకు నిద్రపట్టదంటూ సెటైర్ వేశారు.
‘స్టాలిన్ను కెసిఆర్ కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించారని మీడియాలో వచ్చింది. ఇక చంద్రం సారుకు నిద్రపడ్డదు. స్టాలిన్ను తానూ కలిసి అటువంటిదేమీ లేదు అని ప్రకటించే దాకా ఊరుకోడు. రెండు ఎంపి సీట్లు కూడా కష్టమేననీ తెలిశాక ఎవరు లెక్కచేస్తారు ఈయన పిచ్చికాకపోతే’ అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.
చంద్రబాబు సర్వే ప్రకటన పైనా విజయసాయి రెడ్డి స్పందించారు.
గెలిచే సీన్ ఉంటే నాలుగు రకాల సర్వేలెందుకు చేయించారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
’సర్వే వివరాలు బయటపెట్టి కనీసం కౌంటింగ్ ఏజంట్లకైనా ధైర్యం నూరిపోయండి. ఎన్నికలు ఐదేళ్లకోసారొస్తాయి. పార్టీ శాశ్వతం. మేలో రావాల్సిన ఎన్నికలను ముందే జరిపి ఇబ్బంది పెట్టాలని చూశారు లాంటి శోకాలెందుకు’ అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.