అమరావతి: చంద్రబాబు ఎక్కడ పాదం మోపితే అక్కడి వారికి శని దాపురించిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా శుక్రవారం చంద్రబాబు వల్ల ప్రాంతీయ పార్టీల నేతలు ఏ మేరకు నష్టపోయారో వివరించారు.
చంద్రబాబు పశ్చిమ బెంగాల్లో పాదం పెట్టడం వల్ల గతంలో 33 సీట్లు గెలిచిన మమతా బెనర్జీ ఈ సారి 22 స్థానాలకే పరిమితం అయ్యారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో ఏడు సీట్లలో కేజ్రీవాల్ ఖాతా తెరవలేదని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. బిఎస్పి 38 సీట్లలో పోటీ చేయగా కేవలం 11 స్థానాల్లో గెలిచిందనీ, అఖిలేష్ యాదవ్ ఆరు దగ్గరే ఆగిపోయారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కర్నాటకలో కుమారస్వామి ఒక్కటే సీటు గెలుచుకున్నారని విజయసాయిరెడ్డి అన్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు బిజిపి వ్యతిరేక కూటమి ప్రయత్నాల్లో భాగంగా పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, లక్నో, కర్నాటక పర్యటనలు చేసిన విషయం దృష్టిలో ఉంచుకుని విజయసాయి రెడ్డి ఈ వ్యఖ్యలు చేశారు.