అమరావతి: నూటికి వెయ్యి శాతం టిడిపి గెలుస్తోందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనపై వైసిపి రాజ్యసభ సభ్యుడి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా బాణాలు వేశారు.
‘నూటికి వెయ్యి శాతం గెలుస్తారట, 40 ఏళ్ల అనుభవంతో అన్ని వర్గాల నుంచి సేకరించిన సమాచారంతో చెబుతున్నాననీ తన భుజాలు తనే చరచుకుంటున్నాడు. జీవితమంతా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, దోచుకోవడమే గదా చంద్రబాబూ, 20 రోజుల్లో తెలుస్తుంది నీ అనుభవం, అంచనాలు ఎందుకు పనికిరాకుండా పోయాయని’ అంటూ విజయసాయి వ్యాఖ్యానించారు.