అమరావతి: అవినీతి తిమింగలాలను వేటాడుతాం అంటూ అవినీతి నిరోధక శాఖ డిజి ఏబి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శనివారం ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘అవినీతి తిమింగలాలను పట్టేస్తానని ఏబి వెంకటేశ్వరరావు అంటుంటే ‘హతోస్మి’ అనిపించింది. చంద్రబాబు కోసం ఫోన్ ట్యాపింగులు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు మొదలు అడ్డమైన అన్ని పనులూ చేసిన ఈయన… తన అవినీతి మీద విచారణ ఎదుర్కొనే స్థితిలో ఉన్నారా? లేక ఇతరుల అవినీతి మీద విచారణ చేసే స్థితిలో ఉన్నారా?’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు
వైసిపి నేతల ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వేళ ఇంటెలిజెన్స్ డిజిగా ఉన్న ఏబి వెంకటేశ్వరరావును ఆ పదవి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తప్పించింది. ఏబి వెంకటేశ్వరరావును బదిలీ చేయడాన్ని నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి నేతలు తప్పుబట్టారు.
పోలింగ్ ప్రక్రియ ముగియటంతో ఈ నెల 22 న ఏబి వెంకటేశ్వరరావును అవినీతి నిరోధక శాఖ డిజిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.
అవినీతి తిమింగలాలను పట్టేస్తానని ఏబీ వెంకటేశ్వరరావు అంటుంటే ‘హతోస్మి’ అనిపించింది. చంద్రబాబు కోసం ఫోన్ ట్యాపింగులు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు మొదలు అడ్డమైన అన్ని పనులూ చేసిన ఈయన… తన అవినీతి మీద విచారణ ఎదుర్కొనే స్థితిలో ఉన్నారా? లేక ఇతరుల అవినీతిమీద విచారణ చేసే స్థితిలో ఉన్నారా? pic.twitter.com/WIhRRne0WE
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 27, 2019