అమరావతి: గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ కోసం నాలుగు లక్షలకుపైగా ఉద్యోగాలు సృష్టిస్తే ప్రశంసించే పెద్ద మనసు టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలకు లేదని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి విమర్శించారు. వాలంటీర్లు రిక్షాలు తొక్కాలనీ, హమాలీ పని చేయాలనీ చెప్పి నిరుద్యోగులను బెదరగొట్టిన పాపం ఊరికే పోదని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ అయిదేళ్లలో ఇంకా వారు చాలా చూస్తారని ఆయన అన్నారు. గుండె రాయి చేసుకోండి అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
గ్రామ సచివాలయాలు,వలంటీర్ల వ్యవస్థ కోసం 4 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టిస్తే ప్రశంసించే పెద్ద మనసు లేదు.రిక్షాలు తొక్కాలని,హమాలీ పని చేయాలి అంటూ నిరుద్యోగులను బెదరగొట్టిన పాపం ఊరికే పోదు @ncbn గారూ.ఈ ఐదేళ్లలో ఇంకా చాలా చూస్తారు.గుండె రాయి చేసుకోండి. @naralokesh @JaiTDP @YSRCParty
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 30, 2019