అమరావతి చంద్రబాబు పరిపాలనలో డొల్లతనం తప్పం మరేదీ లేదని వైసిపి ఎంపి వి.విజయసాయిరెడ్డి మరోసారి విమర్శించారు. ట్విట్టర్ వేదికగా గతంలో టిడిపి హయాంలో జరిగిన ఒప్పందాలను ఉదహరిస్తూ చంద్రబాబును విమర్శించారు.
డ్వాక్రా ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేందుకు 16 కంపెనీలతో చంద్రబాబు ప్రభుత్వం 2015 నవంబర్లో ఎంఒయూలు కుదుర్చుకుందని విజయసాయిరెడ్డి చెప్పారు. వాల్మార్ట్, ఐటిసి, మహీంద్ర అండ్ మహీంద్ర, ఓలం ఆగ్రో లాంటి దిగ్గజ కంపెనీలను పిలిపించి సినిమా చూపించారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఒప్పంద పత్రాలు చెదలు పట్టాయి కానీ కొనుగోళ్లు జరగలేదని విజయసాయిరెడ్డి వివరించారు.
డ్వాక్రా ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేందుకు 16 కంపెనీలతో @ncbn ప్రభుత్వం 2015 నవంబర్లో ఎంఓయూలు కుదుర్చుకుంది.వాల్మార్ట్, ఐటీసీ, మహీంద్ర&మహీంద్ర,ఓలం అగ్రో లాంటి దిగ్గజ కంపెనీలను పిలిపించి సినిమా చూపించాడు. ఒప్పంద పత్రాలు చెదలు పట్టాయి.కానీ కొనుగోళ్లు జరగలేదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 30, 2019