అమరావతి: ప్రతి విషయంలోనూ రాజకీయ మైలేజ్ పొందడం పైనే చంద్రబాబు ఆలోచనలు పరిభ్రమిస్తాయని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. ట్విట్టర్ వేదికగా ఆదివారం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ధర్మపోరాట దీక్ష అయినా, హరికృష్ణ పార్ధివ దేహం సాక్షిగా టిఆర్ఎస్తో పొత్తు ప్రస్తావన అయినా, కోడెల అంతిమయాత్ర అయినా చంద్రబాబు ఆరాటం ఒకేలా ఉంటుందని విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రతి సందర్భాన్నీ తన పార్టీ కార్యక్రమంలాగానే చంద్రబాబు భావిస్తారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
రివర్స్ టెండర్లో 58కోట్ల రూపాయలు ఆదా అయితే ప్రజాధనాన్నిలూటీ చేసిన చంద్రబాబు అంతకంటే భిన్నంగా ఎలా స్పందిస్తారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తానంటే తీగలపై బట్టలారేసుకోవాల్సిందేనని అన్నారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీని ప్రవేశపెడితే ప్రైవేటు హాస్పటళ్ల కోసమే అని శోకాలు పెట్టారని విజయసాయిరెడ్డి విమర్శించారు.
ప్రజాసమస్యలపై గళం విప్పాల్సిన చంద్రబాబు తన బంధువులు, బినామీలు నష్టపోతున్నారనే ఆందోళనతో అమరావతి, పోలవరం, కృష్ణపట్నం, బందరు పోర్టుల గురించి వాపోతున్నారని విజయసాయి వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు.
ఇంటికో ఉద్యోగమిస్తానని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చి గెల్చిన చంద్రబాబు నిరుద్యోగులకు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారని విజయసాయి రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి లక్షా 30వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే పేపరు లీకయిందని కిరసనాయిలుతో కలిసి డ్రామాలాడుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రశ్నాపత్రం ఎలా రూపొందిస్తారో తెలుసుకొని ఎడవొచ్చుగా అని విజయసాయి వ్యంగంగా విమర్శించారు.
రివర్స్ టెండర్లో 58 కోట్లు ఆదా అయితే ప్రజాధనాన్నిలూటీ చేసిన @ncbn ఇంతకంటే భిన్నంగా ఎలా స్పందిస్తారు. నాడు వైఎస్సార్ గారు ఉచిత విద్యుత్తు ఇస్తానంటే తీగలపై బట్టలారేసుకోవాల్సిందే అన్నాడు. ఆరోగ్యశ్రీని ప్రవేశ పెడితే ప్రైవేటు హాస్పిటళ్ల కోసమే అని శోకాలు పెట్టాడు. @AndhraPradeshCM
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 22, 2019
ప్రజా సమస్యలపై గళం విప్పాల్సిన @ncbn తన బంధువులు, బినామీలు నష్టపోతున్నారనే ఆందోళనతో అమరావతి, పోలవరం, కృష్ణపట్నం, బందరు పోర్టుల గురించే వాపోతున్నాడు. కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలని డిమాండు చేస్తున్నాడు. ప్రభుత్వం ఏం చేయాలో ప్రాంప్టింగ్ అవసరం లేదు బాబు గారూ. @JaiTDP
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 22, 2019
ధర్మ పోరాట దీక్ష అయినా, హరికృష్ణ పార్థివ దేహం సాక్షిగా టీఆర్ఎస్తో పొత్తు ప్రస్తావన అయినా, కోడెల అంతియ యాత్ర అయినా @ncbn ఆరాటం ఒకేలా ఉంటుంది. రాజకీయంగా మైలేజ్ పొందడం పైనే ఆయన ఆలోచనలు పరిభ్రమిస్తాయి. ప్రతి సందర్భాన్నీ తన పార్టీ కార్యక్రమంలాగానే భావిస్తారాయన. @JaiTDP
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 22, 2019
ఇంటికో ఉద్యోగమిస్తానని 2014 ఎన్నికల్లో గెలిచాడు. నిరుద్యోగులకు వెయ్యి పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. @AndhraPradeshCM గారు 1.30 లక్షల మంది యువతను రిక్రూట్ చేస్తే పేపర్ లీకయిందని కిరసనాయిలుతో కలిసి డ్రామాలాడుతున్నాడు. ప్రశ్నా పత్రం ఎలా రూపొందిస్తారో తెలుసుకొని ఏడవొచ్చుగా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 22, 2019