అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు జగన్మోహనరెడ్డి నేతృత్వం కాయకల్ప చికిత్సతో సమూల ప్రక్షాళన చేయనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోమవారం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో గత అయిదు సంవత్సరాలలో కులప్రీతి, ఆశ్రితపక్షపాతం నెలకొని ఉందనీ, అంతులేని అవినీతి జరిగిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ పరిస్థితులను చక్కబెట్టాలంటే సమూల ప్రక్షాళన అవసరమని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. కాబోయే ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజారంజకమైన సుపరిపాలనే ధ్యేయంగా జగన్మోహనరెడ్డి పరిపాలన చేయనున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
https://twitter.com/VSReddy_MP/status/1132907024272875520
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?