అమరావతి : రాజధాని ప్రాంత రైతాంగానికి అండగా ఉంటానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను వైసిపి రాజ్యసభ్య సభ్యుడు వి విజయసాయిరెడ్డి పరోక్షంగా విమర్శించారు. చంద్రబాబు అజ్ఞాత పార్టనర్ కూడా యూటర్న్ల మాస్టర్ అయిపోయారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. నాడు అమరావతి ప్రజా రాజధాని కాదు, టిడిపి రాజధాని అని గర్జించిన వ్యక్తి ఇప్పుడు రాజధానిని అక్కడి నుండి మారిస్తే ఒప్పుకునేది లేదంటున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మాటపై నిలబడలేని వారు రాజకీయాలను ఏం మారుస్తారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
రెండు రోజుల క్రితం రాజధాని ప్రాంత రైతాంగం హైదరాబాదులోని జనసేన ఆఫీసుకు వెళ్లి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను కలిసిన విషయం తెలిసిందే. తమ ఆందోళనకు మద్దతు ఇవ్వాలని రైతాంగం కోరగా, అండగా ఉంటాననీ, వారం రోజుల్లో రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తానని కూడా పవన్ హామీ ఇచ్చారు.