అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్సీ లోకేష్లపై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.
చిల్లర వ్యాఖ్యలు చేసిన మాలోకం, కాలజ్ఞాని ఈ దశాబ్దపు పొలిటికల్ కమెడియన్లని విజయసాయిరెడ్డి అభివర్ణించారు.
‘ప్రకాశం బ్యారేజీకి 70 గేట్లు ఉండగా ఒక గేటుకు నాటు పడవను అడ్డం పెట్టి తమ కరకట్ట కొంపను ముంచారన్న ‘నగ్న’ సత్యాన్ని బయటపెట్టిన మాలోకాన్ని, మగవాళ్లు లేని సమయంలో వాలంటీర్లు ఇళ్ల తలుపులు కొడుతున్నారని చిల్లర వ్యాఖ్యలు చేసిన ‘కాలజ్ఞాని’ని ఈ దశాబ్దపు పొలిటికల్ కమెడియన్లుగా గుర్తించాలి అని విజయసాయి రెడ్డి అన్నారు.
ప్రకాశం బ్యారేజికి 70 గేట్లుండగా ఒక గేటుకు నాటు పడవను అడ్డం పెట్టి తమ కరకట్ట కొంపను ముంచారన్న ‘నగ్న’ సత్యాన్ని బయటపెట్టిన మాలోకాన్ని, మగవాళ్లు లేని సమయంలో వలంటీర్లు ఇళ్ల తలుపులు కొడుతున్నారని చిల్లర వ్యాఖ్యలు చేసిన ‘కాల జ్ఞాని’ని ఈ దశాబ్దపు పొలిటికల్ కమేడియన్లుగా గుర్తించాలి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 2, 2019
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?