అమరావతి: తెలంగాణలో లేని ఇసుక కొరత ఆంధ్రాలో ఎందుకు ఉందని టిడిపి అధినేత చంద్రబాబు వేసిన ప్రశ్నపై వైసిపి ఎంపి వి. విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
తెలంగాణలో లేని ఇసుక కొరత ఆంధ్రాలో ఎందుకుందంటే అక్కడ చంద్రబాబు పాలన చేయలేదన్నారు. తమరు రాష్ట్రంలో సృష్టించిన ఇసుక మాఫియా పెడరెక్కలు విరిచి కట్టడానికి సిఎం జగన్ కొత్త విధానం తీసుకువచ్చారని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో దోపిడీ పాలన అంతమైందని తెలిసి పకృతి కరుణించిందనీ, నదులు నిండుగా ప్రవహిస్తున్నాయనీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తేడా అర్థమైంది కదా అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.