అమరావతి: గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంటే చంద్రబాబు పులివెందుల పంచాయతీ, జె ట్యాక్స్ అంటూ ఏడుపు రాగాలు తీస్తున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి విమర్శించారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబును విమర్శించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలు సంపాదించుకున్న తెలుగుదేశం కార్యకర్తలు ఉత్సాహంలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా లబ్దిదారుల జాబితా వెలువడి గ్రామాల్లో పండుగ వాతావరణం ఉందని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు మాత్రం పులివెందుల పంచాయతీ, జె ట్యాక్స్ అని ఏడుపు రాగాలు తీస్తుంటే క్షేత్ర స్థాయిలో తుపుక్కుమని ఊస్తున్నారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
previous post