విజయవాడ, జనవరి 29: విజయవాడలోని హోటల్ ఐలాపురంలో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్ ఆధ్వర్యంలో అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం ప్రారంభం అయ్యింది. విభజన అనంతరం ఆంధ్రరాష్ట్రానికి జరిగిన నష్టం, సాఫల్య వైఫల్యాలపై సమావేశంలో చర్చించనున్నారు.
ముఖ్య అతిధిగా సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సమావేశానికి తెలుగుదేశం తరుపున మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, నక్కా ఆనంద్బాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, కాంగ్రెస్ పార్టీ నుండి తులసిరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రిటైర్డ్ ఐఎఎస్ కృష్ణారావు తదితర ప్రముఖులు హజరైయ్యారు.
ఈ సమావేశానికి టిడిపి నేతలు హజరైనందున తాము రావడం లేదని వైసిపి నేతలు స్పష్టం చేస్తూ ఉండవల్లికి సమాచారం ఇచ్చారు.