కరోనా మహమ్మారి ప్రపంచం లోకి ఎంట్రీ ఇచ్చాక పరిస్థితి మొత్తం మారిపోయిన సంగతి తెలిసిందే. వైరస్ ప్రభావంతో చాలా కంపెనీలు మూతపడటంతో పెద్ద పెద్ద కంపెనీల ఉద్యోగస్తులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇదే తరుణంలో విద్యా సంస్థలు కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో ఉండే విద్యార్థులు చాలావరకు పేదవాళ్లు కావటంతో ఇంటర్నెట్ సదుపాయం లేక స్మార్ట్ ఫోన్ కూడా కొనలేని పరిస్థితి ఉండటంతో.. చదువుకు దూరమయ్యే పరిస్థితులు చాలా వరకు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో గ్రామాల్లో ఉండే విద్యార్థులు ఏమాత్రం చదువుకు దూరం కాకుండా ఆన్లైన్ తరగతులకు అన్ని సదుపాయాలు కల్పించే రీతిలో జగన్ సర్కార్ రెడీ అయింది.
మేటర్ లోకి వెళ్తే ఏపీ లో ఉన్న అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ లైబ్రరీలు ఏర్పాటు చేయడానికి జగన్ ప్రభుత్వం రెడీ అయ్యింది. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ కనెక్షన్, అమ్మ ఒడి కింద ల్యాప్టాప్ ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేయటానికి ఉన్నత అధికారులతో జగన్ ఇటీవల సమీక్ష చేశారు. దీంతో రాబోయే రోజుల్లోనే గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికి ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించినట్లు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?