YS Jagan – ABN RK: జగన్ దూకుడు పెంచారు.. సంక్షేమ పథకాల అజెండాని అమల్లోకి తెచ్చారు.. తాను అమలు చేస్తున్న సంక్షేమానికి విలన్లు తన ప్రతిపక్షాలే అనే కోణంలో ప్రచారాన్ని పెంచారు.. వాయిస్ పెంచారు.. జగన్ దూకుడుని, ఆ విమర్శలకు ప్రతిపక్ష మీడియా కూడా కౌంటర్లు సిద్ధం చేసుకుంటుంది. జగన్ కి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిసైడ్ అయినట్టు ఉంది.. అందుకే నిన్న ఒంగోలులో సీఎం జగన్ మాట్లాడిన మాటలకు.. ఈరోజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కౌంటర్ కథనం రాశారు. దాంతో పాటూ “మీది పెద్ద సంక్షేమమేనా..? మీ పథకాలు, సంక్షేమం ఏపాటిదో రోజుకొక ఆర్టికల్ లో చూపిస్తాం.. మీ పథకాల ఉద్దేశాన్ని ఎండగడతాం” అంటూ సవాల్ చేసారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వైసీపీ బలమైన వ్యూహంతో..!
ఏపీలో అప్పులు పెరిగాయి.. ఏపీ ఆర్ధిక స్థోమతకు మించి అప్పులు పెరిగాయి..” కానీ ఈ అప్పుల లెక్కలు, ఈ అప్పుల ఉద్దేశాలు రెండు పార్టీలు ఒకరిపై ఒకరు వేసుకుంటున్నారు. నిన్న ఒంగోలులో సీఎం జగన్ మాట్లాడుతూ.. “అప్పులు పెరిగాయి అంటున్నారు.. చంద్రబాబు హయాం లో భారీగా అప్పులు చేసారు. వారు చేసినట్టే నేను చేశాను. రాష్ట్ర పరిస్థితి అలా ఉంది. కానీ ఆ దుష్ట చతుష్టయం నాపై బురద చల్లుతుంది.. గోబెల్స్ ప్రచారం చేస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. అంటే ఏపీ అప్పుల విషయంలో కూడా జగన్ ఎదురుదాడి ఆరంభించారు. ఒకవైపు సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెల్తూ.. ఆ పథకాల చుట్టూ రాజకీయాన్ని పండించాలి అనేది సీఎం జగన్ ఉద్దేశం. అందుకే బలంగా ఆ వాదాన్ని వినిపిస్తున్నారు. పథకాలు వద్దు అంటున్నారు.. శ్రీలంకతో పోలుస్తున్నారు.. “వాళ్ళు వద్దన్నా నేను మీకు పథకాలు ఇస్తాను” అంటూ ఒక భరోసా ఇస్తూనే.. ఒకరకంగా విపక్షాన్ని విలన్ చేసే స్ట్రాటజీ ప్రయోగించారు. సో.. వైసీపీ ఒక బలమైన వ్యూహంతోనే వెళ్తుంది..!
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఏబీఎన్ ఆర్కే సవాల్.. రేపటి నుండి..!!
ఇన్నాళ్లు జగన్ స్పీచ్ కి వారానికోసారి కౌంటర్లు ఇచ్చే ఏబీఎన్ ఈరోజు మాత్రం వెంటనే ఇచ్చేసింది. ఇస్తూనే ఇకపై రోజుకొక కథనం ఉంటుంది.. మీ సంక్షేమం గొప్పేమిటో తేలుస్తాం అంటూ సవాల్ చేసింది.. సో.. ఇక ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నేరుగా సీఎం జగన్, వైసీపీతో పోరుకి దిగనుంది అనేది వాస్తవం..! అయితే సంక్షేమ పథకాల అంశంతో జగన్ దే పైచేయి. ఆ పథకాల ఉద్దేశాలను ఏమైనా తప్పు పడితే పెడతారేమో తప్పితే.. ఏ పథకమూ తీసేయాలని ఏబీఎన్ లో రాయలేరు. జగన్ విమర్శలతో టీడీపీ కూడా ఆత్మరక్షణలో పడింది. “సంక్షేమ పథకాలు టీడీపీ వద్దు అంటుంది” అనే వైసీపీ ప్రచారం ద్వారా ఆ లబ్ధిదారులు నమ్మితే టీడీపీని పూర్తిగా దూరం పెట్టె అవకాశం లేకపోలేదు. అందుకే టీడీపీ నేతలు కూడా ఆచితూచి మాట్లాడుతున్నారు. సో.. ఇక మీదట ఏపీలో సంక్షేమ రాజకీయం కొన్నాళ్ళు సాగనుంది..!