రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచడానికి జగన్ చేపట్టిన ప్రయత్నాలకు కృష్ణ బోర్డుకి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నా … తరుణంలో కేంద్ర జల శక్తి ఈ వివాదంలో ఎంటర్ అయింది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ఎజెండాలు తమకు పంపాలని గతంలో కోరిన ఇరు రాష్ట్రాలకు చెందిన యజమాన్యం బోర్డులు కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు.
ఇదిలా ఉండగా ఈ విషయం లో కేంద్రం మరింత చొరవ తీసుకుని ఎజెండాతో పాటు సమావేశం తేదీని ఖరారు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర జల శక్తి కార్యదర్శి యూపీ సింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లెటర్ రాయడం జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించాలని అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో వచ్చే నెల 5వ తారీఖున ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ అందుబాటులో ఉండాలని సూచించింది.
ఈ విషయం నడుస్తూ ఉండగానే దీన్ని డీల్ చెయ్యడం లో భాగంగా తాజాగా కృష్ణా రివర్ బోర్డు రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ముందుకెల్లోదని జగన్ సర్కార్ కి లెటర్ రాయడం జరిగింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతులు వచ్చేవరకు ప్రాజెక్టుపై ముందుకు వెళ్లవద్దని లెటర్లో కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి టెండర్లు పిలవడాన్ని ఆపేయాలని పేర్కొంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ మరియు కేసీఆర్ ఇద్దరూ కలిసి ఆగస్టు 5వ తారీఖున సమావేశం అయ్యే రోజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనే దాని విషయంలో రెండు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.