నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసిపి పార్టీ అధిష్టానానికి మొదటి నుండి పక్కలో బల్లెం లాగా మారిన సంగతి తెలిసిందే. ప్రతిసారి ఏదో ఒక కొత్త సబ్జెక్టుతో వైసీపీ ప్రభుత్వం పై బురదజల్లే విధంగా … ప్రభుత్వం పై వ్యతిరేఖత తీసుకొచ్చే రీతిలో వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పని చేసే ఆయా మీడియా ఛానల్ కి తెగ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా త్వరలో వినాయక చవితి పండుగ వస్తున్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వానికి రఘురామకృష్ణంరాజు సలహా ఇచ్చారు.
హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి అని స్పష్టం చేశారు. అన్ని విఘ్నాలను తొలగించే దేవుడిగా వినాయకుడిని హిందువులు కోలుస్తారని, కావున ఈ పండుగ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల పేరిట హిందువుల మనోభావాలు గాయపరచకూడదు అని స్పష్టం చేశారు. ఇప్పటికే కొని నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని, రాష్ట్రంలో హిందూ మత పెద్దలతో స్వామీజీ లతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.
మరోపక్క జగన్ చుట్టుపక్కల ఉండే పెద్దలు కూడా ఇదే తరహాలో ఏపీ ప్రభుత్వానికి ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో వినాయక మండపాలకి ఎప్పటిలాగానే అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో స్వామీజీ లతో హిందూ సంస్థలతో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే బెటర్ అని జగన్ పార్టీ పెద్దలు సూచించినట్లు సలహా ఇచ్చినట్లు టాక్.