Ys Jagan: దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ మహమ్మారిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా అనుభవం లేకపోయినా గాని జగన్ తీసుకుంటున్నా చాలా నిర్ణయాలు దేశవ్యాప్తంగా తల పండిపోయిన రాజకీయ నేతలను ఆలోచనలో పడేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా పక్క రాష్ట్రాల ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పాలన చాలా బాగుందని సోషల్ మీడియాలో… పొగుడుతున్న సందర్భాలు కూడా ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాలను కూడా ఆదుకునే రీతిలో జగన్ వ్యవహరిస్తున్న శైలి.. ఆయన ఇమేజ్ ని రోజురోజుకీ మరింత తారా స్థాయికి తీసుకెళ్తున్నయి అని పొలిటికల్ టాక్.
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాలు మరికొద్ది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా.. బెస్ట్ సీఎం గా .. టాప్ ఫైవ్ లో జగన్ ఎప్పుడు తన స్థానం ఉండేలా చూసుకుంటూన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే చీఫ్ మినిస్టర్ అప్రూవల్ రేటింగ్ అనే సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో తాజాగా.. దేశ వ్యాప్తంగా ఉన్న అందరి ముఖ్యమంత్రుల కంటే రెండో స్థానంలో జగన్ నిలిచారు. మరోసారి తన సత్తా చాటారు. జగన్ 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత… రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎన్నికలలో గెలుస్తూనే ఉన్నారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో భారీగా గెలిచి మరోసారి ప్రజలు తన వైపే ఉన్నారు అని ఢిల్లీకి తెలిసేలా భారీ మెజార్టీ సాధించారు. ఈ రీతిగా ఎదురులేని పొలిటికల్ లీడర్ గా.. జగన్ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక గాలి.. వేస్తున్న నేపథ్యంలో కమలం పార్టీ పెద్దలు.. జగన్ ని లైన్ లో పెట్టుకోవడానికి.. ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్క బీజేపీ పార్టీ మాత్రమే కాక దేశవ్యాప్తంగా.. జాతీయస్థాయిలో రాణించడం అని టైం కోసం వెయిట్ చేస్తున్న నాయకులు.. జగన్ ని ఆలోచనల్లో పెట్టుకొని రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్.