Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం తిరుమల పర్యటనకు రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో ఆధునీకరించిన శ్రీవారి పోటును లాంఛనంగా జగన్ ప్రారంభించబోతున్నారు. టీటీడీ నిర్వహించబోయే శ్రీవారి పోటు ఉత్సవానికి హాజరు కాబోతున్నారు. 2018 వ సంవత్సరం లో పోటులో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది.
ఆ తర్వాత టీటీడీ అధికారులు ఆధునీకరించి శ్రీవారి పోటును విస్తరించారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రారంభించబోతున్నారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో పాటు జిల్లాకు చెందిన మంత్రులు మరియు ఎంపీలు ఎమ్మెల్యేలు సీఎం పర్యటన నిమిత్తం ఏర్పాట్లు చూసుకుంటున్నారు. త్వరలో తిరుమల తిరుపతి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుమల తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భారీ స్థాయిలో విజయం సాధించడంతో..తిరుపతి ఉప ఎన్నిక విషయంలో పార్టీ తరఫున ఎవరు బరిలోకి దిగుతారు అన్నది ఏపీ రాజకీయాల్లో సస్పెన్స్ నెలకొంది.