కరోనా వైరస్ కట్టడి చేయడంలో అదేవిధంగా చైనా తో సరిహద్దుల వివాదం విషయంలో మోడీ చూపించిన తెగువ దేశ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో వరుసగా రెండుసార్లు కేంద్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన మోడీ మూడోసారి ఎక్కడ తనకు ఎదురు లేకుండా చూసుకునే రీతిలో ముందుకు సాగటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చాలావరకు ప్రత్యర్థి అనుకున్న కాంగ్రెస్ పార్టీ చాలావరకు బలహీనపడటంతో మోడీ కన్ను ఇప్పుడు దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలపై పడినట్లు జాతీయ రాజకీయాల్లో వార్తలు అవుతున్నాయి.
ఇందిరాగాంధీ మాదిరిగా దేశానికి అధ్యక్షుడిగా ఉంటూ దేశాన్ని, జాతీయ రాజకీయాన్ని తన కనుసన్నల్లో నడిపించాలని మోడీ గట్టిగా ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో కుప్పలు తెప్పలుగా ఉన్న ప్రాంతీయ పార్టీల పని పట్టడానికి…. ఆ పార్టీ అధ్యక్షులను టార్గెట్ చేస్తూ మోడీ రెడీ అవుతున్నట్లు వార్తలు నేషనల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో రాజకీయం చూస్తే, చాలా వరకు ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోంది. ఒక్క కర్ణాటక రాష్ట్రం మినహా మిగతా చోట్ల అంతా ప్రాంతీయ పార్టీలే బలమైన పార్టీలుగా ఉన్నాయి.
ఇటువంటి తరుణంలో మోడీ అందర్నీ టార్గెట్ చేసే అవకాశం ఉన్న తరుణంలో ఆయన మైండ్ లోకి తాను వెళ్లకుండా సరైన రీతిలో ఏపీ సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు జాతీయ స్థాయిలో ఉన్న నాయకులను ప్రభావితం చేసే విధంగా ఉండటంతో పాటు దేశవ్యాప్తంగా బాగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రుల ర్యాంకింగ్స్ లో మెరుగైన ఫలితాలు వస్తున్న తరుణంలో, ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ని చాలా వరకు మోడీ టచ్ చేయలేరని మరోపక్క మేధావులు అభిప్రాయపడుతున్నారు.
ఈ విషయం నడుస్తూ ఉండగానే అటాకింగ్ మోడ్ లోకి వెళ్లడమే ప్లాన్ గా రంగం లోకి దిగుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని టచ్ చేయాలని ఆలోచన మోడీ కి రాకుండా…. ఏపీలో బీజేపీకి అంతా చాన్స్ ఇవ్వకుండా జగన్ సరికొత్త ప్లాన్ వేసినట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళ్తే ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపి పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో కాపు ఓటు బ్యాంక్ పూర్తిగా బిజెపి పరిధిలో ఉండే విధంగా చూసుకుంటున్న తరుణంలో ఆ ఛాన్స్ బీజేపీకి లేకుండా జగన్ అటాకింగ్ మోడ్ లోకి వెళ్లడమే ప్లాన్ గా రంగం లోకి దిగుతూ సరికొత్త స్ట్రాంగ్ ప్లాన్ వేసినట్లు టాక్. ఈ నేపథ్యంలో త్వరలో రాష్ట్రంలో ఉన్న కాపులకు మరింత మేలు చేసే రీతిలో జగన్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు ఏపీ మీడియా సర్కిల్స్ లో వినబడుతున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?