ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సమయంలో వైసీపీ పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులు తీవ్ర స్థాయిలో బహిరంగంగా ప్రభుత్వంపై మీడియా ముందు విమర్శలు చేయడం జరిగింది. దీంతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రతిపక్ష పార్టీలు కూడా ఓ రేంజ్ లో వైసీపీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు వైసిపి ప్రభుత్వ పరిపాలన బాలేదని వాళ్ల వ్యాఖ్యలను టార్గెట్ చేసుకుని ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో రెచ్చిపోతున్నారు.
ఇటువంటి తరుణంలో ఈ విషయం జగన్ దాక వెళ్లడంతో ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం జరిగిందో వారందరితో త్వరలోనే స్పాట్ లోనే మీటింగ్ అరేంజ్ చేయమని జగన్ పేషీ నుంచి పార్టీ సీనియర్స్ కి ఆర్డర్స్ వచ్చాయట. స్థానిక ఎన్నికలకు ముందే ఈ అసంతృప్తి నేతలందరితో జగన్ మీటింగ్ పెట్టనున్నట్లు వైసీపీ పార్టీలో టాక్. ఒకరిద్దరు కాదు ఏకంగా పదుల సంఖ్యలో పార్టీలో అసమ్మతి నేతలు ఉండటంతో జగన్ తో వీరి భేటీ వార్త అటు పార్టీలో ఇటు రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా వారి చేసిన వ్యాఖ్యల పట్ల జగన్ సీరియస్ అయ్యారట. సమస్య ఏదైనా ఉంటే ప్రభుత్వ పెద్దల దగ్గర చర్చించాలి తప్ప ఇలా రోడ్డెక్కి మీడియా ముందు మాట్లాడటం ఏంటి అని జగన్ ఇటీవల పార్టీ పెద్దలతో వాళ్ల గురించి సీరియస్ అయినట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే రాబోయే రోజుల్లో అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులకు జగన్ సీరియస్ గానే క్లాస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నట్లు అర్థమవుతోంది. పైగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాళ్లు చాలా వరకు పార్టీ ఎన్నికలకు ముందు జాయిన్ అయిన వారు కావటంతో వాళ్లకి గట్టిగా స్ట్రోక్ ఇవ్వడానికి జగన్ రెడీ అయినట్లు టాక్.