వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంలో సొంత పార్టీ నేతలే వైయస్ జగన్ పై కాకుండా అధికారులపై తెలివిగా విమర్శలు చేస్తున్నారు. దీంతో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరియు కొంతమంది ప్రజాప్రతినిధులు తీవ్ర విమర్శలు చేయడంతో అటు మీడియాలోనూ ఇటు ప్రతిపక్షంలోనూ వైసీపీ పార్టీ పరువు పోయినట్లుగా పరిస్థితులు మారుతున్నాయి.
అయితే ఈ విషయంలో జగన్ ఎన్నికలకు ముందు చేరిన వారు చేసిన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవడం లేదని కానీ తాను నమ్మిన రాయలసీమ ప్రాంతం అనంతపురం నాయకులు అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖ మంత్రి బంధువు విమర్శించడం తో రివర్స్ అవ్వడంతో తీవ్ర అసంతృప్తి లో జగన్ ఉన్నట్లు సమాచారం. దగ్గర దగ్గరగా ఉంటూనే ఈ విధంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే జగన్ తట్టుకోలేకపోతున్నాట్లు వైసీపీ పార్టీలో టాక్.
అంతేకాకుండా కొంత మంది వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తూ నియోజకవర్గంలో ఇసుక దొరకడం లేదని నియోజక అభివృద్ధికి అధికారులు సహకరించడం లేదు అంటూ మీడియా ముందు తెగ గగ్గోలు పెట్టడం అందరికి తెలిసిందే. దీంతో వైసిపి నాయకులు చేసిన కామెంట్లు అటు సోషల్ మీడియాలో ఇటూ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ గా మారడంతో ఏడాది పరిపాలనలో ప్రజలు సానుకూలంగా ఉన్న ప్రజా ప్రతినిధులు అసంతృప్తితో ఉన్నారని తీవ్రస్థాయిలో వార్తలు ప్రసారమవుతున్నాయి. కాగా ఈ విషయంలో ఒక సొల్యూషన్ పెట్టడానికి అసంతృప్తి నేతలు లిస్టు జగన్ రెడీ చేయమని పార్టీ పెద్దలకు ఆదేశించినట్లు టాక్. మరి వారి విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.