YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలలో అనంతపురం ముందు వరుసలో ఉంది. ఒక్క అనంతపురం మాత్రమే కాక రాయలసీమ ప్రాంతంలో అనేక జిల్లాలలో కరోనా, బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా బయట పడుతున్నాయి. దీంతో కరోనా బారినపడిన రోగులు హాస్పిటల్ కి వెళ్ళిన వైద్యం అందని పరిస్థితి ఏర్పడటంతో ఆక్సిజన్ బెడ్లు సకాలంలో అందకపోవడంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
ఇలాంటి తరుణంలో జగన్ ప్రభుత్వం అనంతపురం జిల్లాలో తాడిపత్రి నియోజకవర్గం లో 500 ఆక్సిజన్ బెడ్లు ఉండే ఆసుపత్రిని కేవలం 15 రోజుల్లో నిర్మించి రికార్డు సృష్టించారు. 13.5 ఎకరాల విస్తీర్ణంలో జర్మన్ హ్యాంగర్ విధానంలో యుద్ధ ప్రాతిపదికన ఈ హాస్పిటల్ నిర్మాణం జరిగింది. దీంతో ఈ ఆసుపత్రి అందుబాటులోకి రావడంతో ఒక అనంతపురం జిల్లా మాత్రమే కాక రాయలసీమ ప్రాంతంలో కరోనా బారిన పడిన రోగులకి కష్టాలు తీరేటట్టు పరిస్థితి మార్చారు ప్రభుత్వ అధికారులు.
Read More: Ys Jagan: పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ సీఎం జగన్..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితి చూస్తే కర్ఫ్యూ అమలు విధానం సత్ఫలితాలు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో స్టేట్ లో రోజుకు పాతిక వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యే పరిస్థితి ఉంటే.. ప్రస్తుతం 10 వేలకు చేరుకున్నాయి. ఈ నెల మొత్తం కర్ఫ్యూ అమలు చేస్తే రాష్ట్రంలో దాదాపు వైరస్ ఉద్రిక్తత అదుపులోకి తీసుకు వచ్చినట్లు అవుతుంది అని మేధావులు అంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కర్ఫ్యూను జూన్ 10 వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఉత్కంఠగా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?