ఏపీ సీఎం జగన్ ముందు నుండి రాష్ట్రంలో మందు విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో మరియు పాదయాత్రలో రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశలవారీగా చేస్తాను అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ విధంగానే నిర్ణయాలు తీసుకున్నారు. మొదటిలో గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులను లేకుండా చేసిన జగన్ ఆ తర్వాత సిటీలలో బార్ షాపుల దగ్గర సిట్టింగ్ విధానం లేకుండా చేయడం జరిగింది. ఆ తర్వాత ఉదయం 10 గంటలనుండి రాత్రి 7 గంటలవరకు మాత్రమే మద్యం లభ్యమయ్యేలా టైమింగ్ కేటాయించడం జరిగింది.
జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి మందుబాబుల నుండి తీవ్ర విమర్శలు రావడం జరిగింది. అయినా గాని జగన్ ఎక్కడ వెనకడుగు వేయకుండా కఠినంగానే మద్యపానం నిషేధం విషయంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇటువంటి తరుణంలో మొట్టమొదటిసారి మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పే రీతిలో జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేమిటంటే రాబోయే రోజుల నుండి రాత్రి 9 గంటల వరకు వైన్ షాపులు తెరుచుకునే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మద్యం దుకాణాలు తెరుస్తున్నారు. అయితే తాజాగా మరో గంట వైన్ షాపులు ఓపెన్ చేసుకునే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా రోజువారీ అమ్మకం వివరాలు నమోదు చేసేందుకు, నగదు లెక్కింపుకు సమయం సరిపోవట్లేదని, అందుకే గంట సమయం పెంచుతున్నట్లు సర్కారు తెలిపింది.