Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్య వైద్య పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన రెండు సంవత్సరాల పాలన పురస్కరించుకున్న శుభ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ శంకుస్థాపన నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం తెలిసిందే. ఏపీ నీ హెల్త్ హబ్ గా మార్చే ఆలోచనలో జగన్ ముందు అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇతర రాష్ట్రాల్లో చికిత్స తీసుకునే పరిస్థితి ఉండకూడదని, వైద్య పరంగా అన్ని సదుపాయాలు రాష్ట్రం లోనే ఉండాలని ఆ దిశగా జగన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
ఇదే తరుణంలో మరో పక్క వైరస్ తో పోరాడుతూ వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం నుండి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకు వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అతి తక్కువ రోజుల్లోనే పంపిణీ కార్యక్రమం చేయడానికి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉంది. కాని దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఉండటంతో.. ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తుంది. ఇలాంటి తరుణంలో వ్యాక్సిన్ విషయంలో ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
Read More: Ys Jagan: దేశంలో ఆ విషయంలో జగన్ ని ఫాలో అవుతున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం..!!
మేటర్ లోకి వెళ్తే చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు, అలాగే ఉద్యోగాల కోసం విసాలపై విదేశాలకు వెళ్లే వారికి.. వ్యాక్సిన్ ముందుగాన్నే వేయించాలని… వ్యాక్సిన్ వేసినట్లు ప్రభుత్వం తరఫున సర్టిఫికేట్ ఇవ్వాలని తాజాగా సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్.. పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్న నేపథ్యంలో.. విదేశాలకు వెళ్లే తక్కువ వయసు వాళ్ళు.. ఈ నిర్ణయంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటంతో వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.