Ys Jagan : నాకు ప్రాణ హాని ఉంది, నాకు ఏదైనా జరిగితే బాధ్యత మొత్తం జగన్ దే అంటున్న టీడీపీ ఎమ్మెల్సీ…!!
Ys Jagan : కడప ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు ఎమ్మెల్సీ బీటెక్ రవి కీలక కామెంట్లు చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఏదైనా జరగరానిది జరిగితే పూర్తి బాధ్యత వైయస్ జగన్ దే అన్నారు. ఈ క్రమంలో తనకి రక్షణ కల్పించాలి అని ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఆశ్రయించారు. కడప జిల్లాలో ఎన్నికల కోడ్ వైలేషన్, ఎన్ఓసి కుల ధ్రువీకరణ పత్రాల లో అధికారుల జాప్యంపై …టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరారు. అంతేకాకుండా బలవంతపు.. ఏకగ్రీవలను ఆపాలని కోరారు. ఇదే క్రమంలో నామినేషన్లు వేయడానికి పోలీసుల ధ్రువీకరణ పత్రం..లేదని తెలిపినట్లు బీటెక్ రవి స్పష్టం చేశారు.
ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాయలసీమ ప్రాంతాల్లో పర్యటిస్తున్న తరుణంలో కొంతమంది టిడిపి నేతలు అధికార పార్టీ పై ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే రాయలసీమ ప్రాంతంలో మొదటి నుండి వైసీపీ పార్టీకి మంచి పట్టు ఉండటంతో.. టిడిపికి ఎన్నికలలో నిలబడటానికి అభ్యర్థులు కూడా చాల చోట్ల దొరకడం లేదని ఆ పార్టీకి చెందిన నాయకులే అంతర్గతంగా డిస్కషన్లు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా పంచాయతీ ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీమ ప్రాంతంలో పర్యటించడం ఏపీ రాజకీయాలు మరింత వేడి పుట్టించే విధంగా ఉన్నట్లు వార్తలు మీడియా సర్కిల్స్ లో వస్తున్నాయి.