YS Jagan: టీకాలపై కేంద్రం తిక్క తిక్క ఆలోచనలు చేస్తుంది.. ఒక ప్రణాళిక లేదు. ఒక పధ్ధతి లేదు. ఒక స్పష్టత లేదు.. అందుకే ఎప్పుడో ఆరునెలల కిందటే అన్ని అనుమతులు వచ్చిన టీకాలు ఇప్పటికీ కోట్లలో ఉత్పత్తి కావడం లేదు.. ఉత్పత్తి తక్కువగా ఉంది అనుకుంటే.. వాటి విక్రయ విధానాలు కూడా సరిగ్గా లేవు.. సరిగ్గా ఇదే పాయింట్ ని సీఎం జగన్ పట్టేసారు. కేంద్రానికి ఓ లేఖ రాశారు. జగన్ రాసిన లేఖలో ఏ మాత్రం అతిశయోక్తులు లేవు. ఆలోచిస్తేనే కేంద్రానికి, దేశానికి మంచిది..!
YS Jagan: బ్లాక్ మార్కెట్ మొదలయిందిగా..!!
కరోనా టీకాలపై ఇప్పటికే బ్లాక్ మార్కెట్ మొదలయింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిన్న ఒక్కో టీకా రూ. 2 వేలుకి అమ్ముతుండగా.. పోలీసులు పట్టుకున్నారు. అతని నుండి 70 టీకాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది ఆరంభం మాత్రమే.. కావాల్సిన టీకాలను ప్రైవేట్ ఆసుపత్రులు ఆర్డర్ పెట్టుకుని.. నిల్వ చేసుకుని కొరతని కాష్ చేసుకోవని గ్యారెంటీ ఏముంది..!? ఒక్కో టీకాను రూ. 5 వేలకు.. 10 వేలకు అమ్ముకోవని గ్యారంటీ ఏముంది..!? దీనికి పుష్కలంగా అవకాశాలున్నాయి. నెల రోజుల కిందట రెమెడీస్వేర్ ఇంజెక్షన్లు, ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు ఎలాగైతే బ్లాక్ మార్కెట్ సృష్టించి అమ్ముకుంటున్నారో.. రేపు టీకా కూడా ఇలాగే జరగొచ్చు.. అందుకే..! సీఎం జగన్ రాసిన లేఖని పరిగణనలోకి తీసుకోవాల్సిందే..
కేంద్రం విధానాలే ప్రధాన లోపం..!!
కేంద్రం ప్రస్తుతం అవలంభిస్తున్న విధానాలు చూస్తే అయా టీకా కంపెనీలు ఉత్పత్తిలో చేసే టీకాల్లో సగం బయట విక్రయించుకోవచ్చు. సగం కేంద్ర ప్రభుత్వానికి/ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి. అంటే ఈ సగం తగ్గించేసి.. ఆ సగం వారికి ముందు ఇచ్చేస్తే.. ప్రభుత్వాలు వేసే ఉచిత టీకాల నిల్వ అయిపోయిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకాలు ఉంటె అప్పుడు అవి బ్లాక్ లో కచ్చితంగా అమ్ముకుంటాయి. అంచేత ప్రభుత్వాలు ఎలాగూ దేశం మొత్తం ఉచితంగా టీకాలు వేస్తామని చెప్పాయి కాబట్టి… కంపెనీలు ఉత్పత్తి చేసే టీకాలన్నీ కొన్ని నెలల పాటూ ప్రభుత్వాలకే అందించేలా ఉండాలి. జగన్ రాస్తున్న లేఖల్లో లోతుగా ఆలోచిస్తే కేంద్రం అమలు చేయాల్సిన నిర్ణయాలే బాగా ఉంటున్నాయి.. కానీ రాజకీయంగా చూసి వీటిని పక్కన పెడుతున్నారేమో..!