ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు వైయస్ జగన్ సర్కార్ రెడీ అవుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లతో మరియు ఎస్పీలతో ఇటీవల వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన టైములో కొత్త జిల్లాల ప్రస్తావన తీసుకురావటం జరిగింది. గతంలో చెప్పినట్టుగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చడానికి జగన్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో 13 జిల్లాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ 25 జిల్లాలుగా ఏర్పడబోతున్నట్లు టాక్ నడుస్తుంది.
ఎన్నికల ప్రచారంలో మరియు పాదయాత్రలో జగన్ గతంలో కొత్త జిల్లాల ఏర్పాటు పై హామీ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా ఈ విషయంలో సొంత పార్టీ నేతలు జిల్లాల పునర్విభజన అంత మంచిది కాదని జగన్ కి చెబుతున్నారట. ఆల్రెడీ ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లా ని విభజించవద్దని కోరడం జరిగింది. ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా శ్రీకాకుళం జిల్లా ని కొత్త జిల్లాగా విభజించవద్దని కోరారు.
ఇదే తరుణంలో రాష్ట్రంలో ఇంకా కొన్ని ప్రాంతాలకు చెందిన నేతలు కూడా కొత్త జిల్లాల ఏర్పాటు ఈ టైంలో అనవసరమని జగన్ నిర్ణయం మార్చుకుంటే బెటర్ అని అంటున్నారట. ముందుగా మూడు రాజధానులు విషయంలో సరైన క్లారిటీ తో ప్రభుత్వం ముందుకు వెళ్లిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు పై కసరత్తు చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సూచిస్తున్నారట. మరి జగన్ ఆలోచన ఏ విధంగా ఉందో అన్నది పార్టీలో పెద్దగా సస్పెన్స్ గా మారింది.