ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేసే విధంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా పనిచేసే వ్యవస్థలపై నిఘా పెట్టినట్లు అనేకమంది విపక్షాల పార్టీల నాయకులు మరికొంత మంది న్యాయవాదులు తాజాగా ఆరోపిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల న్యాయవాదుల ఫోన్ టాపింగ్ విషయంలో ఏపీ ప్రభుత్వం పై అనేక విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రజ్యోతి పత్రిక ఈ కథనాన్ని ప్రచురించి వివాదానికి తెర లేపడం తో జగన్ ప్రభుత్వం పై టిడిపి పార్టీ నాయకులు మరికొంత మంది న్యాయవాదులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు ఏకంగా ప్రధాని మోడీ కి లెటర్ కూడా రాశారు.
ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కేంద్రం కలుగు చేసుకోవాలని ప్రజల హక్కులను కాలరాస్తూ జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు మోడీకి బాబు లెటర్ రాయడం జరిగింది. ఇదిలా ఉండగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల “ఫోన్ ట్యాపింగ్” ఈ వ్యవహారంపై సీనియర్ న్యాయవాది శ్రావణ్ కుమార్ తీవ్రస్థాయిలో స్పందించారు. న్యాయవ్యవస్థను అత్యంత గౌరవం గా చూసే శ్రావణ్ కుమార్, గతంలోనే న్యాయవ్యవస్థపై ఏపీ అధికార పార్టీకి చెందిన నేతలు ఇష్టానుసారంగా మాట్లాడిన టైములో తీవ్ర స్థాయిలో ఖండించడం జరిగింది. ఇలాంటి తరుణంలో తాజాగా “ఫోన్ ట్యాపింగ్” వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును, తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్యనికి ఇలాంటి విషయాలు చాలా ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ఆంధ్రజ్యోతి కథనం ఆధారం చేసుకుని హైకోర్టులో శ్రావణ్ కుమార్ పిల్ దాఖలు చేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద విజయవాడకు చెందిన ఈ మాజీ న్యాయమూర్తి, హైకోర్టు సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ హైకోర్టులో ఈ విషయం తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయ్యారు. న్యాయ స్థానాలపై నిఘా మేటర్ రుజువైతే రాజ్యాంగంలో ఆర్టికల్ 356 ప్రకారం ప్రభుత్వాన్ని తక్షణమే భర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇదిలావుండగా తాజాగా శ్రవణ్ కుమార్ వేసిన పిల్ విచారణకు హైకోర్టు స్వీకరించింది. మరోపక్క ఏపీ ప్రభుత్వం అదంతా తప్పుడు కథనాలని, కొట్టిపారేస్తోంది. అంతేకాకుండా వార్త రాసిన ఆంధ్రజ్యోతికి లీగల్ నోటీసులు ఇవ్వటం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా ఆంధ్రజ్యోతి పత్రిక తమ దగ్గర పక్కా సమాచారం, ఆధారాలున్నాయి కాబట్టే రాశాం అని చెబుతోంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది అన్నది ప్రజెంట్ సస్పెన్స్ గా ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?