ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవి చేపట్టిన నాటి నుండి చాలా వరకూ పార్టీని పక్కనపెట్టి, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందజేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా పార్టీ ఎమ్మెల్యేలు కూడా కనీసం అపాయింట్మెంట్ కూడా జగన్ ఇచ్చిన సందర్భాలు లేవు. ఎంతసేపు తాను ప్రకటించిన పథకాలు గ్రామ వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా? ప్రజా సమస్యల విషయంలో గ్రామ సచివాలయ వ్యవస్థ పని చేస్తుందా లేదా అనే దానిపైన ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
పరిస్థితి ఇలా ఉండగా చాలా మంది పార్టీ ఎమ్మెల్యేలు మరియు సీనియర్ నాయకులు కూడా మీడియా ముందు జగన్ ఏడాది పాలన అయినా సమయములో పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఎమ్మెల్యేలు దొరకటం లేదని అంటూ కామెంట్ చేశారు. అదే సమయంలో మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు కచ్చితంగా పార్టీ పై ఫోకస్ పెట్టాలని జగన్ దృష్టికి అప్పట్లో మంత్రులు తీసుకొచ్చారు.
జగన్ కి మంత్రులు ఫిర్యాదు…
దీంతో వైయస్ జగన్ పార్టీ విషయంలో ముగ్గురు ఇన్చార్జిలను నియమించి ఆయా జిల్లాలను బాధ్యతలను అప్పజెప్పడం జరిగింది. అయినా గానీ పార్టీలో అసంతృప్తి నెలకొనడంతో తాజాగా ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది పార్టీ నాయకులకు కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించాలని జగన్ ను కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో అనేకమంది మంత్రులు…పరిపాలన పరంగా అంతా బాగానే ఉంది. కానీ పార్టీ పరంగా గ్రూపు రాజకీయాలు చాలా నియోజకవర్గాలలో జరుగుతుందని జగన్ దృష్టికి తీసుకు వచ్చారట.
జగన్ త్వరగా నిర్ణయం తీసుకోండి…
ఎన్నికల ముందు పార్టీ కేడర్ ని ఉత్సాహపరిచే విధంగా చూసుకుంటే, పార్టీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందని, అని కోణాలలో పార్టీ ప్రభుత్వం చాలా పటిష్టంగా ఉంటుందని జగన్ కి మంత్రులు తెలిపారట. ఈ విషయంలో ఎంత ఫాస్టుగా నిర్ణయం తీసుకుంటే పార్టీకి అంత డ్యామేజ్ జరగదని జగన్ మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ లో తెలిపారట. దీంతో జగన్ కూడా ఓకే అన్నట్లు ఇక నుండి పార్టీ క్యాడర్ తో కూడా మీటింగ్ లు పార్టీ తరఫున పెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.