ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో మరియు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. దాదాపు ఇప్పటికే మొదటి ఏడాదిలోనే 90% వాగ్దానాలను వైయస్ జగన్ నెరవేర్చిన ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో పేరు సంపాదించాడు. ఇటువంటి తరుణంలో అధికారంలోకి వస్తే కొత్త జిల్లాల ఏర్పాటు కూడా ఉంటుందని జగన్ హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ దిశగానే వైయస్ జగన్ అడుగులు వేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
వచ్చే మార్చి కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాలుగా ఉన్నది 25 జిల్లాలుగా మార్చడం గ్యారెంటీ అని ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా జగన్ ప్రభుత్వం మార్చడానికి రెడీ అవుతోంది. దీంతో చాలావరకు కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలుగుదేశం పార్టీ కోలుకోలేని విధంగా సరైన రీతిలో విభజన ఉంటుందని వార్తలు అందుతున్నాయి.
చాలావరకు కొత్త జిల్లాల ఏర్పాటు విషయములో తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్న నియోజకవర్గాలు, కంచుకోటగా ఉన్న ప్రాంతాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఎలాగైనా ఈ కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు అండ్ కో ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు మరోపక్క వార్తలు వైరల్ అవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయంతో రాజకీయంగా ప్రతిపక్షాలకు వైయస్ జగన్ చావుదెబ్బ కొట్టబోతున్నట్లు ఏపీ రాజకీయాల్లో టాక్ నడుస్తోంది.