ఇటీవల వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు వీరిద్దరి బేటీ 40 నిమిషాల పాటు జరిగింది. అయితే మోడీ మరియు జగన్ బేటీ లపై టిడిపి పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా చేస్తున్న ప్రచారంపై అంబటి రాంబాబు పంచుల వర్షం కురిపించారు. రాష్ట్ర అభివృద్ధి కి సంబంధించిన అంశాలపై ప్రధానితో మాట్లాడితే తప్పేంటి అని చురకలు అంటించారు. కేసులు మాఫీ చేసుకోవడానికి కోసం ప్రధానిని కలుస్తున్నారని….చేస్తున్న కామెంట్లకు ప్రధాని చెబితే కోర్టులో ఉన్న కేసులు మాఫీ అవుతాయా అంటూ అంబటి రాంబాబు నిలదీశారు.
ఇదేవిధంగా జగన్ పై ఉన్న కేసులు విచారణ స్పీడ్ అవుతున్నట్లు టీడీపీ అనుకూల మీడియా కథనాలు ప్రసారం చేయడం చూస్తే మరోసారి కుట్రలు చేయడానికి సిద్ధం అవుతున్నట్లు ఉంది అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రధానితో ఏఏ అంశాలపై చర్చించడం జరిగిందో అధికారికంగా సీఎం కార్యాలయం ప్రకటించిన కానీ టిడిపి నేతలు చంద్రబాబు కుంభకోణాల పై సీబీఐ విచారణ కోసం అన్నట్టు వ్యవహరించడం చూస్తే వాళ్ల వెన్నులో వణుకు పుడుతున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.
ప్రధాని మోడీ ని సీఎం కలిస్తే అక్కడ ఉండి చూసినట్టుగా ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది అని అంబటి రాంబాబు సీరియస్ అయ్యారు. ఆ సమయంలో రాధాకృష్ణ ఏమైనా బల్లకింద ఉన్నారా అని సెటైర్లు వేశారు. ఆంధ్రజ్యోతి యజమాని “బల్ల కింద రామకృష్ణ” అంటూ షార్ట్ కట్ లో “బకీరా” అంటూ రాంబాబు పంచులు వర్షం కురిపించారు. ఒకవైపు టీడీపీ నేతలు అసలు భేటీలో ఏం మాట్లాడారో చెప్పాలని ప్రశ్నలు వేస్తూ ఉంటే మరోపక్క ఆంధ్రజ్యోతి యజమాని “బకీరా”… మోడీ జగన్ మాట్లాడిన సమయంలో బల్ల క్రింద కూర్చుని విన్నట్టుగా కథనాలు రాస్తున్నారు.
దీన్ని బట్టి చూస్తే ఆంధ్రజ్యోతి రహస్య విషయాలను టిడిపి నేతలు కూడా నమ్మడం లేదా అని రాంబాబు ఎద్దేవా చేశారు. దీంతో అంబటి రాంబాబు పంచులు వైసీపీ పార్టీలో కూడా హైలైట్ అవడంతో ఈ విషయం జగన్ దాక వెళ్లడంతో ఆయన కూడా పడి పడి నవ్వినట్లు అంతర్గతంగా వినబడుతున్న టాక్.