వైసీపీ పార్టీలో తల పండిపోయిన రాజకీయ నేతలు చాలా వరకూ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వారే. పైగా జగన్ తండ్రి వైఎస్ కి అత్యంత సన్నిహితులు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వాళ్ల పేర్లు గమనిస్తే ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఇంకా కొంతమంది నాయకులు.
ys jagan meeting with party senior leaders ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చినా వీళ్లందరికీ మంత్రి పదవులు ఇవ్వకుండా వీళ్ళు ఉండే నియోజకవర్గాలలో ప్రాంతాలలో జూనియర్ల కే ఎక్కువ జగన్ ప్రాధాన్యత ఇస్తూ మంత్రి పదవులు కట్టబెట్టడం జరిగింది. దీంతో తాము ఏలుబడి చేసినా ప్రాంతాలలో తమకంటే జూనియర్ల కంటే ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ప్రజలలో రావటం తో పాటు గౌరవం దక్కింది.
ఈ పరిణామంతో రాజకీయాల్లో ఎంతో తల పండిన ఈ సీనియర్ నేతలకు అసహనం నెలకొన్నట్లు వార్తలు వైరల్ కావటంతో…. పార్టీలో సీనియర్ల అందరినీ కూర్చోబెట్టి జగన్ మీటింగ్ పెట్టినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. జగన్ యాటిట్యూడ్ మొదటి నుండి గమనిస్తే తనతో కష్టాలు అనుభవించిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తూ ప్రస్తుతం అధికారంలోకి రావడంతో వారికి సరైన స్థానాలు కల్పించడం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీలో ఎలక్షన్ ముందు జాయిన్ అయినా, మధ్యలో జాయిన్ అయినా ఈ సీనియర్లకు పరిస్థితిని మొత్తం వివరించి పదవులు రానందుకు పెద్దగా బాధపడవద్దు అని..రాజధాని, పరిపాలన మొత్తం గాడిలో పడిన తర్వాత పార్టీ మీకు సరైన స్థానం ఇస్తుందని, తప్పకుండా న్యాయం చేస్తానని అంతవరకు ఓపికగా ఉండాలని ఈ తలపండిన నేతలకు జగన్ హితబోధ చేసినట్లు పార్టీలో టాక్.