Ys Jagan Mohan Reddy : ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల హడావిడి మామూలుగా లేదు. సార్వత్రిక ఎన్నికల వాతావరణాన్ని మించి మరి వైసిపి-టిడిపి పార్టీ ల మధ్య పోటా పోటీ వాతావరణం నువ్వానేనా అన్నట్టుగా ఉంది. ప్రతిపక్షంలో బలం తక్కువగా ఉన్న గాని చంద్రబాబు తన రాజకీయ వ్యూహాలతో వైసీపీని ముప్పు తిప్పలు పెడుతున్నారు. పరిస్థితులు ఇలా ఉండగా సీఎం జగన్ కి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నోటీసులు జారీ చేయటం, తాజాగా ఏపీలో చర్చనీయాంశంగా మారింది. విషయంలోకి వెళితే 2014 వ సంవత్సరం ఎన్నికల ప్రచారం టైంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై అనుమతులు లేకుండా జగన్ ఎన్నికల ప్రచారం చేయడంతో అప్పట్లో కేసు నమోదయ్యింది.
ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద కోర్టులో కేసు నమోదు కావడంతో..ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 12 వ తారీఖున కోర్టులో హాజరు కావాలని, నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తాజాగా సీఎం జగన్ కి సమాన్లు జారీ చేయడం జరిగింది. కోర్టులో ఫిర్యాదు చేసిన వారు వైఎస్ జగన్ ను ఏ1 గా పేర్కొన్నారు. మిగతా వారిపై కూడా కేసులు నమోదు చేయగా, వారిపై ఉన్న కేసులను చాలా కాలం క్రితమే కోర్టు కొట్టివేసింది. అయితే కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జగన్ కోర్టుకు రాకపోవడంతో తాజాగా పోలీసుల చార్జిషీట్ దాఖలు చేయడంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్ట్ తప్పనిసరిగా 12న హాజరవ్వాలని జగన్ కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.