ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి చాలావరకూ మొండితనంగా అనుకున్నది సాధించే వరకు నిద్రపోరూ అన్న రీతిలో ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని చాలా మంది జగన్ సన్నిహితులతో పాటు ఆయనకు దగ్గరగా ఉండే రాజకీయ నేతలు కూడా చెప్పుకొస్తారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి అయ్యాక అయితే మరీను తాను తీసుకున్న నిర్ణయాల విషయంలో అనేక అడ్డంకులు వచ్చినా వాటిపై పోరాటానికి సిద్ధపడుతూ, అవసరమైతే న్యాయస్థానాలకు ఎదురుగా కూడా జగన్ వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా నిమ్మగడ్డ విషయంలో అదే విధంగా ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగుల విషయంలో చాలా వరకు న్యాయస్థానంలో తన వాదన నేగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు.
అయితే తన నిర్ణయాల విషయంలో ఏ విధంగా అయితే జగన్ పోరాటం చేశారో , రాష్ట్రానికి సంబంధించి కీలక విషయమైన ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కూడా అదే రీతిలో న్యాయస్థానంలో పోరాటం చేసి ఉంటే రాష్ట్రానికే కాదు దేశానికి హీరో అయ్యే ఛాన్స్ జగన్ కి దక్కేది అని కొంతమంది సీనియర్ నాయకులు అంటున్నారు. న్యాయబద్ధంగా విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ప్రత్యేకహోదా అనేది ముగిసిన అధ్యాయం అనే విషయంపై జగన్ న్యాయస్థానాలలో పోరాడి ఉంటే… వైసిపి పార్టీ కి మైలేజ్ వచ్చేదని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
అదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున పోరాడిన ముఖ్యమంత్రిగా దేశంలో జగన్ కి మరింత గుర్తింపు దక్కేది అని పేర్కొంటున్నారు. ఈ విషయంలో జగన్ న్యాయస్థానానికి వెళ్ళకుండా అనవసరంగా ఛాన్స్ మిస్ చేసుకున్నారని, కేంద్రంతో కాంప్రమైజ్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కొంతమంది నేతలు పేర్కొంటున్నారు. నిమ్మగడ్డ మరియు ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగుల విషయం మాదిరిగా ఏపీ ప్రత్యేక హోదా విషయంలో న్యాయస్థానాలలో జగన్ మొండివైఖరితో పోరాడితే ఏపీ రాజకీయం వేరే రకంగా ఉండేదని అభిప్రాయాలు చెప్పుకొస్తున్నారు.