సాక్షాత్తు ఏపీ సీఎం జగన్ అడ్డా పులివెందులలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అనుమానం పెనుభూతం అని పెద్దలు అన్నారు.
ఇప్పుడు ఇదే అనుమానం పెళ్లి అయ్యి మూడు నెలలు అయినా….. వధువును కడతేర్చింది. కట్టుకున్న భర్త కి భయంకరమైన అనుమానం ఉండటం తో…..భార్య ని దారుణంగా అత్యంత కిరాతకంగా హత్య చేసి చంపేశాడు. పోలీసు విచారణలో తేలిన వివరాల ప్రకారం అశోక్ అనే వ్యక్తి, వీరమ్మ అనే యువతిని 3 నెలల క్రితం పెళ్లి చేసుకోవడం జరిగింది.
వివాహమైన తర్వాత రోజునుంచే అశోక్ తన భార్య వీరమ్మ పై అనుమానం పెంచుకున్నాడు అంట. ఉన్న కొద్ది అనుమానం పెరగటంతో మూడు రోజుల క్రితం వీరమని అత్యంత దారుణంగా చంపేసి పులివెందులలోని శిల్పారామం దగ్గర మూడో కన్ను కి తెలియకుండా పూడ్చి పెట్టే చేశాడట. అయితే ఆమె ఇంటి బంధువులకి మూడు రోజుల నుంచి యువత కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో అశోక్ ని నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెప్పటంతో యువతి బంధువులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
దీంతో వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరపగా…. అసలు విషయం బయటపడింది. తన భార్యను హత్య చేసి పూడ్చి పెట్టినట్లు అశోక్ ఒప్పుకున్నాడు. దీంతో సీఎం అడ్డాలో నే పెళ్ళాం ని దారుణంగా చంపిన ఈ దుర్మార్గపు ఘటన హోంమినిస్టర్ దృష్టికి రావడంతో సుచరిత సీరియస్ అయిందట.
నిందితుడిని అసలు వదిలిపెట్టరు కూడదని పోస్ట్ మార్టం కేసు చాలా సీరియస్ గా చేపట్టి కఠిన కారాగార శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించినట్లు సమాచారం. దీంతో కడప పోలీసులు యువతి శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, నిందితుడు అశోక్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది.