ఏపీ సీఎం వైఎస్ జగన్ పరిపాలన దేశవ్యాప్తంగా మొదటి నుండి అనేక మందిని ప్రభావితం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎలాంటి అనుభవం లేని జగన్ అధికారంలోకి వచ్చిన సమయంలో టిడిపి నాయకులు మరియు రాష్ట్రంలో మరికొంతమంది పార్టీలకు చెందిన వారు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలు ఒక రౌడీ, ఫ్యాక్షనిస్టు చేతిలో పెట్టారు… ఏపీ ప్రజల భవిష్యత్తు ఇంకా చీకట్టే అన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సీన్ కట్ చేస్తే జగన్ సీఎంగా దేశంలో తల పండిపోయిన మేధావులను సైతం ప్రభావితం చేసే విధంగా పరిపాలన చేసినట్లు అనేక జాతీయ పత్రికలు చేసిన సర్వేలలో బయటపడింది.
ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన సర్వే లో బెస్ట్ సీఎం రేసులో మూడో స్థానాన్ని జగన్ దక్కించు కోవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థలో ఎక్కడ అవినీతి జరగకుండా జగన్ తీసుకొచ్చిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పనితీరు చాలా బాగుందని అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం తాజాగా చెప్పుకొస్తోంది. అధికారంలోకి వచ్చిన జగన్ చాలా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటూ తనకి ప్రజలకి ఏమాత్రం రిలేషన్ పోకూడదని….ప్రభుత్వ పథకాలు నేరుగా వారికి చేరేలా గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో ప్రజలతో తన పరిపాలన మమేకం చేశారు.
గ్రామవాలంటీర్స్ అడుగు తో వ్యవస్తలో మార్పు…
ప్రభుత్వానికి సంబంధించి ప్రతి పని నేరుగా లబ్ధిదారులకు చేరే రీతిలో జగన్ తీసుకొచ్చిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఈ ఏడాది ఆగస్టు 15 కి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఒక్క సారిగా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల పై చిలుకు గ్రామ, వార్డు వాలంటీర్లు వ్యవస్థను తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించి ప్రయోగాత్మకంగా చేపట్టిన జగన్ నిర్ణయం టాప్ అండ్ బెస్ట్ రికార్డు రాష్ట్రంలో క్రియేట్ చేసింది. కరోనా కట్టడి చేయడంలో అదేవిధంగా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు సమయానికి అందేలా…. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ చాలా బాగుందని, జగన్ అధికారంలోకి వచ్చాక చాలా మార్పులు వచ్చినట్లు ఇప్పుడు ఏపీ ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కేంద్రం కూడా ఆలోచించాలి….
మరోపక్క ఇలాంటి విధానాన్ని తమిళనాడు, ఒరిస్సా, పంజాబ్ మరికొన్ని రాష్ట్రాలు అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వ్యవస్థ ప్రతి రాష్ట్రంలో కేంద్రం పెడితే చాలా వరకు అవినీతి రహిత దేశం అవుతుందని ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమం ప్రజలకు సులువుగా చేరుతుందని మేధావులు చెప్పుకొస్తున్నారు.