(ఫైల్ ఫోటో)
అమరావతి: రెండవ సారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదిని అభినందించేందుకు వైఎస్ఆర్సిపి శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదివారం న్యూఢిల్లీ వెళుతున్నారు.
ఆదివారం తాడేపల్లి నుండి స్వగ్రామం పులివెందుల వెళ్లి ఇడుపులపాయలోని దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించాలని భావించినప్పటికీ మోది అపాయింట్మెంట్ ఖరారు కావడంతో ఆ పర్యటన వాయిదా వేసుకొని న్యూఢిల్లీ వెళుతున్నట్లు సమాచారం.
ఈ భేటీలో ప్రధాని నరేంద్ర మోదిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయడంతో పాటు 30న తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంతో పాటు వివిధ రాష్ట్రాభివృద్ధి అంశాలపైనా ప్రధాని మోదితో జగన్మోహనరెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తోంది.