Ys Jagan: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ తనదైన శైలిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా నిండు అసెంబ్లీలో తనకు ప్రాణం విలువ అంటే ఏంటో బాగా తెలుసు అంటూ గతం లోకి వెళ్లారు. తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన సమయంలో .. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది మరణించారు వారిని ఓదార్చడానికి అప్పట్లో ఓదార్పుయాత్ర చేసినట్లు జగన్ గుర్తు చేశారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు పడుతూ ఉండటం తో.. తెలుగు రాష్ట్రాలలో ఏ రాజకీయనాయకుడు చేయని రీతిలో ఓదార్పుయాత్ర చేసినట్లు వైయస్ జగన్ పేర్కొన్నారు.
ఇక ఇదే రీతిలో సభలో మాట్లాడుతూ ప్రాణం విలువ తెలుసు కాబట్టే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీలో సమూలంగా అనేక మార్పులు తీసుకు వచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వర్తింపు చేసేలా చాలా కమిట్మెంట్ తో ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్టు జగన్ స్పష్టం చేశారు. ఇదే ఆరోగ్యశ్రీలో వైసీపీ పార్టీ అధికారంలోకి రాకముందు కేవలం వెయ్యి రోగాలకు మాత్రమే .. ఈ పథకం వర్తించే పరిస్థితి ఉండేదని కానీ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక 2400 రోగాలకు ట్రీట్మెంట్లు ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు తీసుకున్నట్లు జగన్ స్పష్టం చేశారు.
ఏదిఏమైనా ఆరోగ్యశ్రీ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు అసెంబ్లీలో జగన్ తెలియజేశారు. ఇదే సమయంలో అనేక విషయాల గురించి మాట్లాడిన జగన్.. గాలిని కూడా కొనాల్సిన పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కొరత రాష్ట్రంలో లేకుండా రాబోయే తరాలకు ఇలాంటి సమస్య రాకుండా శాశ్వతంగా మీ సమస్యకు పరిష్కారం ఇచ్చే రైతులు అన్ని హాస్పిటల్స్ లో ఆక్సిజన్ జనరేటర్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.