విభజనతో నష్టపోయి ఆర్థికంగా రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా వైయస్ జగన్ తాను ఇచ్చిన హామీలు అమలు చేస్తూనే మరోపక్క అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నారు. చేస్తున్న పనులకు మీడియా పరంగా పెద్దగా పబ్లిసిటీ గురించి జగన్ ఆలోచించక పోయినా గాని ప్రత్యర్థి పార్టీలకు చెందిన మీడియా సంస్థలు సోషల్ మీడియాలో కొన్ని గ్రూప్ లు మాత్రం ప్రభుత్వ పనితీరు పై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నట్లు ముందునుండి వైసిపి ఆరోపిస్తూనే ఉంది. ఈ విషయంలో ఫస్ట్ లో వైయస్ జగన్ చూసీచూడనట్టు వదిలేసిన ఇటీవల మరీ భయంకరంగా పేట్రేగి పోవటంతో లేనిపోని వార్తలు ప్రచురించడంతో ప్రత్యర్థుల మీదకి సరికొత్త బృందాన్ని బాణాలుగా ఉపయోగించడానికి ఒక పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేస్తూ జగన్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్ర సాంకేతిక సమన్వయకర్తలుగా కొంతమందిని నియమిస్తూ జగన్ సెన్సషనల్ డెసిషన్ తీసుకున్నారు.
జగన్ తీసుకున్న ఈ టీమ్ లో చేకూరి కిరణ్ జక్కం సుధాకర్ రెడ్డి మల్లాది సందీప్ కుమార్ ఏ.లింగారెడ్డి కే.పి. ప్రసాద్ రెడ్డి ఐ.నారాయణరెడ్డి జి.దశరథరామిరెడ్డి వై. రాజశేఖర్ రెడ్డి లను సభ్యులుగా ఉన్నారు. ఈ సభ్యులంతా రియల్ టైం గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) సీఈవో ఆధ్వర్యంలోని విభాగంలో పనిచేస్తారని ప్రభుత్వం నియామక ఉత్తర్వుల్లో వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అమలవుతున్న పథకాలు గురించి గాని రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి గానీ వ్యతిరేకంగా ఎలాంటి పత్రికల్లో అయినా సోషల్ మీడియాలో అయినా ఎలక్ట్రానిక్ మీడియా లో అయినా వెంటనే ఆ వార్తలు రాసే బృందాన్ని పట్టుకోవడమే వీర డ్యూటీ. ఇటీవల ప్రభుత్వం పై లేనిపోని వార్తలు రాస్తూ సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రత్యర్థులు రెచ్చిపోవడంతో వారిని అరికట్టడానికి రాష్ట్ర సాంకేతిక సమన్వయకర్తలుగా వీరిని ప్రభుత్వం నియమించింది. సో ఇప్పటినుండి తన పథకాలపై అమలవుతున్న నిర్ణయాలపై వ్యతిరేక వార్తలు రాసే ప్రత్యర్థులకు జగన్ చెక్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.