నేటి నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న తరుణంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఆదివారం సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ ఎంపీ లోక్ సభ పక్షనేత మిథున్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన అనేక వివరాలను వెల్లడించారు. మీడియాతో మిథున్ రెడ్డి మాట్లాడుతూ కరోనా నియంత్రణ చర్యలు అదేవిధంగా భారత్ – చైనా సరిహద్దు వివాదాలు, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధుల వంటి విషయాలపై పార్లమెంటులో చర్చించాల్సిన అవసరం ఉందని స్పీకర్ నీ కోరినట్లు చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అంశంపై కూడా జరగబోయే సమావేశంలో ప్రస్తావించబోతున్నట్లు స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇదిలావుండగా పార్లమెంట్ సాక్షిగా మోడీని ఈ విషయంలో మూడు చెరువుల నీళ్లు తాగించే విధంగా జగన్ వైసీపీ ఎంపీ లకు సరికొత్త ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
పూర్తి విషయంలోకి వెళితే రాజ్యసభలోనూ పార్లమెంటులోనూ కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం వైసిపి పార్టీ అవసరం ఉన్న తరుణంలో…. ప్రతి సమావేశంలోనూ జగన్ ఏపీకి రావాల్సిన స్పెషల్ స్టేటస్ విషయంలో వైసీపీ ఎంపీలు మాట్లాడాలని, కేంద్రానికి ఎప్పటికప్పుడు గుర్తు చేయాలని కోరినట్లు టాక్ వస్తోంది. చాలా వరకు రాష్ట్రంలో బిజెపి నేతలు మత రాజకీయాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టె తరహాలో వ్యవహరిస్తున్న నేపథ్యంలో…. పార్లమెంటు సాక్షిగా మోడీని, రాష్ట్రంలో ఉన్న బీజేపీని ఏపీ స్పెషల్ స్టేటస్ అనే టాపిక్ తో రాజకీయంగా ఇరుకున పెట్టడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళి పుంజుకోవడానికి ఏపీ స్పెషల్ స్టేటస్ విషయంపైనే త్వరలో పోరాడటానికి రెడీ అవుతున్న తరుణంలో మోడీ రాష్ట్రంలో ఉన్న బిజెపి చాలావరకు పొలిటికల్ గా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?