ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీని వైయస్ జగన్ ముప్పుతిప్పలు పెట్టిన అంతగా మరే రాజకీయ నేత ఇబ్బందులు పెట్టలేదని సీనియర్ రాజకీయ నేతలు చెబుతుంటారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుని, వ్యవస్థలని మరోపక్క టీడీపీకి అండగా ఉండే మీడియాని జగన్ ఎదుర్కొన్నట్లుగా మరో రాజకీయ నాయకులు కూడా ఎదుర్కొన్న లేదని వ్యాఖ్యానిస్తుంటారు. కాగా రాజకీయంగా ఎన్ని దెబ్బలు తగిలిన జగన్ మాత్రం తన తెగింపు నిర్ణయాలతో 2019 ఎన్నికలో టీడీపీకి చావుదెబ్బ రుచి చూపించడం జరిగింది.
అధికారంలో ఉన్న పార్టీ ఒక్కసారిగా 23 స్థానాలకు పడిపోయి కొద్దిపాటి లో టీడీపీ ప్రతిపక్షానికి పరిమితం అయింది. ఈ పరిస్థితిలో టీడీపీ పార్టీలో ఉంటే ఇంకా భవిష్యత్తు ఉండదు అనే భావనతో చాలామంది నేతలు ఇతర పార్టీల వైపు చూడటం జరిగింది. ఇటీవల ‘మహానాడు’ జరిగిన టైంలో కొంతమంది ఎమ్మెల్యేలు రాకపోవటం అంతకుముందే ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి జై కొట్టడంతో భవిష్యత్తులో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా పోవటం గ్యారెంటీ అనే టాక్ ఏపీ లో బలంగా వినబడుతోంది. ఇటువంటి సమయంలో పార్టీని బలోపేతం చేయడం కోసం 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నడూ లేని విధంగా పెను మార్పులు తీసుకురావటానికి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఏకంగా పార్టీ అధ్యక్షుడు పోస్టులు మార్చడానికి చంద్రబాబు రెడీ అవుతున్నారట. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా గల్లా జయదేవ్ ని, రాష్ట్ర అధ్యక్షుడిగా రామ్మోహన్ నాయుడు ని నియమించడానికి చంద్రబాబు ఆసక్తి చూపిస్తున్నట్లు టిడిపి పార్టీలో గుసగుసలు వినబడుతున్నాయి. అంతేకాకుండా ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమంలో ఈ విషయం పై కొంతమంది నేతల దగ్గర తన అభిప్రాయాన్ని కూడా తెలియజేసినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తమ్మీద జగన్ రాజకీయ ఎత్తుగడలకు తెలుగుదేశం పార్టీలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నయి. మరోపక్క పార్టీ అధ్యక్ష పదవిని టెంపరరీగా వేరే వారికి ఇచ్చి బీజేపీతో చేతులు కలపడానికి చంద్రబాబు వేస్తున్న రాజకీయ ఎత్తుగడ ఇది అని మరి కొంతమంది అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?