Ys Jagan: 2021-22 కి సంబంధించిన బడ్జెట్ ఏపీ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం తెలిసిందే. కరోనా ఉద్రిక్తత కారణంగా కేవలం కొద్ది మంది సమక్షంలోనే జరిగిన ఈ ఒక రోజు బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే లు … మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలన గురించి ఇంకా అనేక విషయాల గురించి ప్రసంగించడం జరిగింది. దీనిలో భాగంగా అభివృద్ధి అనే పదానికి అసలు డెఫినిషన్ ఏంటో చెప్పుకొచ్చారు.
అభివృద్ధి గురించి జగన్ మాట్లాడుతూ అసలు అభివృద్ధి అంటే ఏమిటో అనే దాని విషయంలో చాలామందికి క్వశ్చన్ మార్క్. చాలామంది 4 బిల్డింగులు కడితే చాలు.., అదే అభివృద్ధి అని అనుకుంటారు. అయితే తన దృష్టిలో అభివృద్ధి అంటే మాత్రం…”నిన్నటి కన్నా ఈ రోజు బాగా ఉండటమే, ఈరోజు కన్నా రేపు బాగుంటది అనే నమ్మకం కలిగించ గలిగితే అది అసలు అయినా అభివృద్ధి” అని జగన్ తనదైన శైలిలో అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. అదే రీతిలో రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు భవిష్యత్తులో అనేక సవాళ్లను ఎదుర్కొనే రీతిలో విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకు వచ్చినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.
అదే విధంగా అభివృద్ధి అంటే శిథిలావస్థ లో ఉన్న పాఠశాలలను మెరుగుపరచడం అంటూ జగన్ తనదైన శైలిలో అసెంబ్లీలో డెవలప్మెంట్ డెఫినేషన్ తెలియజేశారు. ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం ద్వారా నేటితరం మన రాష్ట్ర విద్యార్థులు భవిష్యత్తులో ఎటువంటి సవాలు ఎదుర్కోకుండా ఇప్పటి నుండే వారిని .. అటువంటి విద్యావిధానంలో రాణించేలా ప్రభుత్వం విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావడం జరిగిందని జగన్ పేర్కొన్నారు.