Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదగా కర్నూలులో కొత్తగా విమానాశ్రయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన మంత్రులు మరియు ఎమ్మెల్యేలు అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 1008 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు నూట యాభై మూడు కోట్ల రూపాయలతో నిర్మాణమైన ఈ విమానాశ్రయాన్ని సీఎం జగన్ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ఈ సందర్భంగా విమానాశ్రయాన్ని ఓపెన్ చేసి జాతికి అంకితం చేసి, విమానాశ్రయానికి “ఉయ్యాలవాడ నరసింహారెడ్డి” అనే పేరు పెట్టారు.
దేశానికి స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించిన ఈయన పేరు పెట్టడంతో కర్నూలు వాసులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 28వ తారీకు నుంచి విమాన రాకపోకలు కర్నూలు విమానాశ్రయం నుండి ప్రారంభం కానున్నాయి. కర్నూల్ విమానాశ్రయం ప్రారంభం కావటంతో మొత్తం రాయలసీమ లో ఇప్పుడు 3 విమానాశ్రయాలు నెలకొన్నట్లు అయ్యాయి. కడప అదేవిధంగా రేణిగుంటలో విమానాశ్రయాలు ఉండటం తాజాగా కర్నూలులో విమానాశ్రయం ఓపెన్ కావటంతో రాయలసీమ వాసులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.