ఇప్పటికే వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఏపీలో చదువుకుంటున్న విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉన్నత విద్యలు కూడా పేదవాళ్లు చదువుకునే విధంగా సకల సదుపాయాలు కల్పిస్తూ చదువు తల్లిదండ్రులకు భారం కాకుండా ఆర్ధికంగా కూడా అమ్మ ఒడి పథకం ఇంకా జగనన్న విద్యా కానుక, జగన్ అన్న వసతి దీవెన వంటి పథకాల ద్వారా ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉండే రీతిలో జగన్ పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో మరో గుడ్ న్యూస్ ఏపీలో విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం తాజాగా తెలియజేసింది. పూర్తి మేటర్ లోకి వెళితే ఇటీవల మనబడి నాడు-నేడు పథకం కింద జరిగిన సమీక్ష సమావేశంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
“నాడు నేడు” పథకం కింద ఫిబ్రవరి నాటికి పూర్తి కావాలని అధికారులకు జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండో దశ పనుల్లో భాగంగా హాస్టల్ విద్యార్థులకు సౌకర్యాలు నాణ్యతతో కల్పించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా బ్యాగ్, షూ, పుస్తకాలు లో కూడా క్వాలిటీ ఎక్కడ తగ్గకూడదని తెలిపారు. విద్యార్థులకు కూడా గోరుముద్ద తరహాలో పౌష్టికాహారం అందించే రీతిలో జూనియర్ కళాశాలలో కూడా ఈ వసతులు కల్పించాలని అధికారులకు జగన్ ఆదేశాలు ఇచ్చారు.
ఒక్క పౌష్టికాహారం మాత్రమే కాక హాస్టల్ విద్యార్థులకు మంచాలు, పరుపూలు, బెడ్ షీట్లు, అలమరాలు ఏర్పాటు చేయాలని కోరారు. అంతే కాకుండా రాష్ట్రంలో ప్రతి మండలంలో జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయాలని, ప్రతి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసే రీతిలో ఆలోచన చేయాలని అధికారులకు జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.