ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఢిల్లీ పర్యటన రద్దు మరొకపక్క హైకోర్టు లో నిమ్మగడ్డ పై ప్రభుత్వం వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవడంతో ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది.
పరిస్థితి ఇలా ఉండగా ఢిల్లీ పర్యటన రద్దు అయిన వెంటనే సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విజయసాయిరెడ్డి, ఇద్దరు మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా కొడాలి నానితో సీక్రెట్ మీటింగ్ నిర్వహించడం అటు పార్టీలోను ప్రభుత్వంలోను టెన్షన్ నెలకొంది.
ఢిల్లీ పర్యటన రద్దు అవటం, ఒక్కసారిగా మంత్రులతో జగన్ సీక్రెట్ గా మీటింగ్ నిర్వహించడం తో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తాడేపల్లి లో మంత్రులతో జగన్ సీక్రెట్ మీటింగ్ లో హైకోర్టు తీర్పు లతో పాటు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వ్యవహారం, ఢిల్లీ టూర్ రద్దు వంటి విషయాలపై రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ పరిణామాలతో సచివాలయంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం అలుముకొంది.