ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు రికార్డు స్థాయిలో జరుగుతున్న మరోపక్క కొత్త పాజిటివ్ కేసులు కూడా రికార్డు స్థాయిలో బయటపడటంతో వైద్య సిబ్బంది కొరత ఏర్పడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇదే టైమ్ లో కరోనా మృతి రేటు ఉన్న కొద్దీ రాష్ట్రంలో పెరుగుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య లక్షా 20 వేలకు పైగానే ఉండటంతోపాటు మృతుల సంఖ్య వెయ్యికి పైగా నమోదవుతున్న తరుణంలో, ఇలాంటి విపత్కర సమయములో తాత్కాలిక వైద్య సిబ్బందిని నియమించుకోవడానికి జగన్ సర్కార్ రెడీ అయింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల కలెక్టర్లకు వీటికి సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించడానికి ముందుకు వచ్చే వైద్య నిపుణులకు నెలకు లక్షన్నర గౌరవ వేతనం ఇవ్వటానికి జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా జనరల్ డ్యూటీ డాక్టర్లకు నెలకు 70,000 చొప్పున వేతనం చెల్లించడానికి ప్రభుత్వం రెడీ అయింది. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాబోయే ఆరు నెలలు పాటు ఈ తాత్కాలిక వైద్యల సేవలను ఉపయోగించుకోవాలని డిసైడ్ అయింది. ముఖ్యంగా రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో వెయ్యికి పైగా రోజు పాజిటివ్ కేసులు బయటపడటంతో ఆ జిల్లా ప్రజలలో భయాందోళన ఉన్న కొద్దీ పెరిగిపోతుంది.
ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లాలో అదేవిధంగా అనంతపురం, గుంటూరు, కర్నూలు జిల్లాలలో అత్యధిక కొత్త పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో ఆయా జిల్లా అధికారులు ఆ జిల్లాలను పూర్తి లాక్ డౌన్ లో పెట్టడం జరిగింది. ఏదిఏమైనా కరోనా చికిత్స విషయంలో ఎక్కడా వైద్య సిబ్బంది కొరత లేకుండా జగన్ ముందు జాగ్రత్తగా తీసుకుంటున్న నిర్ణయాలు పలువురిని ఆశ్చర్య పరుస్తున్నాయి. కరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలో యూరప్ దేశాలలో ఎక్కువగా మరణ రేటు పెరగటానికి కారణం వైరస్ కాదని వైద్య సిబ్బంది వల్లే అన్ని మరణాలు సంభవించడంతో అలాంటి పరిస్థితి రాష్ట్రంలో రాకుండా… జగన్ ముందు జాగ్రత్తగా కరోనా ఆసుపత్రులు ఎక్కడికక్కడ పెడుతూ, ఈ విధంగా తాత్కాలిక వైద్య సిబ్బంది వైద్య సేవలను ఆరునెలలపాటు వినియోగించుకునే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు పార్టీలో ఉన్న పెద్ద నాయకుడు చెప్పుకొస్తున్నారు.